చలంను 'ఆంధ్రా దిలీప్' అని తొలిసారి పిలిచిందెవరో తెలుసా?
on Sep 30, 2020
పినిశెట్టి శ్రీరామమూర్తి రచన, దర్శకత్వంలో పాలకొల్లు కళాకారులు పాల్గొన్న 'పల్లె పడుచు' నాటకం 1950-52 ప్రాంతాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఉర్రూతలూగించింది. ఓసారి ఆ నాటక ప్రదర్శన చూసిన హిందీ అగ్రనటుడు పృథ్వీరాజ్ కపూర్.. అందులో హీరోగా నటించిన చలంను చూసి ఆంధ్రా దిలీప్ అని మెచ్చుకున్నారు. 'పల్లె పడుచు'ను సినిమాగా తీస్తే, అందులోనూ హీరోగా నటించిన చలం అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు.
వెంటవెంటనే నా చెల్లెలు, వదినగారి గాజులు, ఇలవేల్పు లాంటి చిత్రాల్లో ప్రముఖ నటులతో గుర్తింపు కలిగిన పాత్రలు పోషించిన శభాష్ అనిపించుకున్నారు. అమాయకత్వం ఉట్టిపడే కథానాయకుడుగానూ, హాస్యనటుడుగానూ రాణించి సవ్యసాచి అనిపించుకున్నారు చలం. ఆయన అసలు పేరు రమణా చలం. స్వయంగా రమణ చిత్ర అనే నిర్మాణ సంస్థను స్థాపించి మట్టిలో మాణిక్యం, బుల్లెమ్మ బుల్లోడు, తోటరాముడు, సన్నాయి అప్పన్న లాంటి మ్యూజికల్ హిట్స్ను నిర్మించారు చలం.
Also Read