అంత్యక్రియలకు వెళ్లడం మానేసి సెలూన్కి వెళతావా?
on Jul 4, 2020
బాలీవుడ్ హీరోయిన్ దిశా పాట్నీ మీద నెటిజన్లు విమర్శల వర్షం ప్రారంభించారు. సెలూన్కి వెళ్లినందుకు ఆమెను నానా మాటలు అంటున్నారు. సాధారణంగా సెలూన్కి వెళ్లడం తప్పు కాదు. అయితే, ప్రముఖ మహిళా నృత్య దర్శకురాలు సరోజ్ ఖాన్ మరణించిన రోజు సెలూన్కి వెళ్లడంతో ఏదో పాపం చేసినట్టు దిశా పాట్నీపై కొందరు పడ్డారు. దారుణంగా తిడుతున్నారు. దీనికి కారణం ఓ సెలూన్ బయట దిశా పాట్నీ కనిపించడమే.
‘సరోజ్ ఖాన్ అంత్యక్రియలకు వెళ్లడం మానేసి సెలూన్కి వెళతావా?’ అన్నట్టు కొందరు కామెంట్ చేశారు. ‘సెలూన్కి వెళ్లడం బదులు సరోజ్ అంత్యక్రియలకు వెళితే బావుండేది’ అని ఒక నెటిజన్ పోస్ట్ చేశారు. ‘సరోజ్ ఖాన్ మరణించినట్టు తెలియదా?’ అని ఇంకొకరు ప్రశ్నించారు. ‘వారం రోజులుగా ప్రతి రోజూ సెలూన్కి వెళుతోంది’ అని ఎవరో ఎగతాళి చేశారు. పాపం... ఈ రోజు ట్రోలర్స్కి దిశా టార్గెట్ అయ్యారు. నిజానికి, ఆమె సరోజ్ ఖాన్ని కీర్తిస్తూ ట్వీట్ చేశారు.
కరోనా నేపథ్యంలో ఉదయం ఏడు గంటలకు ముంబైలోని సబర్బన్ మలద్లో సరోజ్ ఖాన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతదేశాన్ని ఖననం చేశారు. బాలీవుడ్ ప్రముఖులు ఎక్కువమందికి వార్త తెలిసే సమయానికి పూర్తి కావడంతో వెళ్లడానికి వీలు పడలేదు.