లెజండరీ డైరెక్టర్ సింగీతంకు కరోనా!
on Sep 16, 2020
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనే కాకుండా హిందీలోనూ సినిమాలను డైరెక్ట్ చేశారు. తనకు కొవిడ్-19 పాజిటివ్గా టెస్ట్లో నిర్ధారణ అయ్యిందంటూ ఓ వీడియో మెసేజ్ ద్వారా ఆయన వెల్లడించారు. సెప్టెంబర్ 9న తనకు కొవిడ్ పాజిటివ్ అని తేలిందని ఆ వీడియోలో సింగీతం తెలిపారు. ఆ విషయాన్ని చాలా స్పోర్టివ్గా చెప్పిన ఆయన, "65 సంవత్సరాలుగా ప్రతి విషయంలోనూ నేను పాజిటివ్గానే ఉంటూ వచ్చాను, ఇప్పుడు నాకు పాజిటివ్ అని మీరు చెప్తున్నారా? అని డాక్టర్ని అడిగాను. నేనెప్పుడూ నెగటివ్గా లేను" అని ఆయన అన్నారు.
"నా లివింగ్ స్పేస్కే పరిమితం అయినప్పటికీ, నేను పుస్తకాలు చదువుతున్నాను. కొన్ని స్క్రిప్ట్లలో పని చేస్తున్నాను. ఈ గ్లోబల్ మహమ్మారి చాలా తీవ్రమైన విషయం. దానిని ఎదుర్కోవడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేస్ మాస్క్లు, భౌతిక దూర నిబంధనలు తప్పనిసరి. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ పాటించిన తరువాత కూడా, ఆ వైరస్ తెలివైన మార్గంలో నాపై దాడి చేసింది. అది ఎలా జరిగిందో నేనిప్పటికీ గుర్తించలేదు.” అని చెప్పారు సింగీతం.
పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, మయూరి, ఆదిత్య 369, బృందావనం, భైరవ ద్వీపం వంటి తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన సింగీతం రూపొందించిన 'పుష్పక విమానం' క్లాసిక్గా ఎంతటి పేరు తెచ్చుకుందో తెలిసిందే. చివరగా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా 2013లో వచ్చిన 'వెల్కమ్ ఒబామా'.
Also Read