బాలీవుడ్లో తెలంగాణ డైరెక్టర్ వెబ్ సిరీస్
on Jul 8, 2020
రామ్ గోపాల్ వర్మ శిష్యుడు... 'దళం', 'జార్జ్ రెడ్డి' సినిమాల దర్శకుడు జీవన్ రెడ్డి ఓ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యారు. తనకు బాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చిందని ఆయన తెలిపారు. తెలుగులో అతడు దర్శకత్వం వహించిన రెండు సినిమాలకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. అయితే, వసూళ్లు మాత్రం ఆశించిన రీతిలో రాలేదు. తెలంగాణ వ్యక్తి కావడంతో తన ప్రతిభకు తగు రీతిలో గుర్తింపు దక్కలేదనే అసంతృప్తి జీవన్ రెడ్డిలో ఉంది. ఆంగ్ల పత్రికతో ఆ విషయం చెప్పుకొచ్చారు. బాలీవుడ్లో తను పుట్టిన ప్రాంతం బట్టి కాకుండా తన ప్రతిభను గుర్తించి అవకాశం ఇచ్చారని జీవన్ రెడ్డి అన్నారు.
జీవన్ రెడ్డి తీయబోయే వెబ్ సిరీస్కి వస్తే... భారీ హంగులతో పీరియాడిక్ డ్రామాగా తీయబోతున్నారట. 'జార్జ్ రెడ్డి' తరవాత తనకు టాలీవుడ్ నుండి అవకాశాలు రాలేదని, బాలీవుడ్ నుండి చాలా వచ్చాయని ఈ దర్శకుడు తెలిపారు.
లాక్డౌన్లో థియేటర్లు షట్డౌన్ అయిన దగ్గర్నుంచి ఎక్కడ చూసినా ఎక్కువగా వెబ్ సిరీస్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అయితే వెబ్ సిరీస్లకు ఇంతటి ఆదరణ ఉంటుందో, లేదో చెప్పలేం కానీ ప్రస్తుతానికి సినిమాలకు ఆల్టర్నేటివ్గా ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నది మాత్రం వెబ్ సిరీస్లే. సో... డైరెక్టర్స్ అటు వైపు చూస్తున్నారు.
Also Read