ఆ డేట్స్ అలా వాడేస్తున్నారు!
on Jun 27, 2016
అప్పట్లో రవితేజ హీరోగా దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో మొదలైన సినిమా ఆగిపోయిందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం కథానాయికగా "కంచె" ఫేమ్ ప్రగ్యా జైస్వాల్ పేరు పరిశీలించగా.. మరో ముఖ్యపాత్ర కోసం "ప్రేమమ్" పాప అనుపమ పరమేశ్వరన్ ను ఫీక్స్ చేసి, అమ్మడికి అడ్వాన్స్ కూడా ఇచ్చేశారట. ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోవడంతో.. అప్పుడు అనుపమకు ఇచ్చిన అడ్వాన్స్ ను తాజా సినిమా కోసం వాడుకోనేందుకు దిల్ రాజు మొగ్గు చూపుతున్నాడు.
శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో "శతమానం భవతి" అనే సినిమాను ఎనౌన్స్ చేసిన దిల్ రాజు.. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు పలువురి పేర్లు పరిశీలించినప్పటికీ, ఎలాగూ అనుపమ డేట్స్ ఉండడం, అమ్మాయికి తెలుగులో "అ ఆ" సినిమా వల్ల విపరీతమైన క్రేజ్ రావడం వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని అనుపమను ఫైనల్ చేశారట!