ఉపేంద్ర సినిమాలు ప్రేక్షకులు చూస్తారా?
on Mar 12, 2019
కన్నడ సూపర్స్టార్ ఉపేంద్రకు తెలుగులోనూ బోల్డంత మంది అభిమానులు ఉన్నారు. ఆయన హీరోగా నటించిన, దర్శకత్వం వహించిన కొన్ని సినిమాలు 'రా', 'ఏ', 'ఉపేంద్ర' తెలుగులోనూ ఘన విజయాలు సాధించాయి. కొంతమంది ప్రేక్షకులకు ఆ సినిమాలు చూసి మతి పోయింది. అయితే.. ఆ సినిమాలను చూసి 'దిల్' రాజు పిచ్చి సినిమాలు అనుకున్నారట. ఉపేంద్ర హీరోగా నటించిన తాజా సినిమా 'ఐ లవ్ యు'. తెలుగులో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్. చంద్రు దర్శకత్వం వహించారు. ఆయనే నిర్మాత. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమానికి దిల్ రాజు అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ "నేను 1998లో 'పెళ్లి పందిరి', పవన్కల్యాణ్ 'తొలిప్రేమ' సినిమాలతో డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్ అవుతున్న రోజులవి. అప్పుడు ఉపేంద్రగారి సినిమాలను ‘తొలిప్రేమ’తో కంపేర్ చేస్తే.. పిచ్చి సినిమాలుగా అనిపించాయి. 'ఇదేంటి? ప్రేక్షకులు ఇటువంటి సినిమాలు చూస్తారా?’ అనుకున్నా. తర్వాత తర్వాత నేను 'ఆర్య' స్ర్కిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు.. ఉపేంద్రగారి సినిమాలు చూశా. ఆయన చాలా బోల్డ్ సినిమాలు చేశారు" అని అన్నారు.