`మహర్షి` టీమ్కి షాకిచ్చిన దేవిశ్రీ!!
on Nov 5, 2018
అవును...మహర్షి టీమ్ కి సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఆరు పాటలు అనుకున్నదానికంటే ముందే ఇచ్చి టీమ్ని షాక్ కి గురిచేసాడట. ఇటీవల కాలంలో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ ఇవ్వడంలో చాలా లేట్ చేస్తున్నాడనీ, దాని వల్ల కొన్ని సార్లు అనుకున్న టైమ్ కు పాటలు పిక్చరైజ్ చేయలేక దర్శక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని బయట వినిపిస్తున్న మాటలు. అయితే మహర్షి చిత్రానికి మాత్రం ఆరు పాటలకు సంబంధించిన ట్యూన్స్ రెడీ చేసి ఇచ్చేసాడట దేవి శ్రీ ప్రసాద్. ఒక థీమ్ సాంగ్, హీరో క్యారక్టర్ ని ఎలివేట్ చేస్తూ హీరో యాంబీషన్ ని తెలిపే సాంగ్ సినిమాకు హైలెట్ కానుందట. సాగిపోరా పోరా పోరా అంటూ సాగే ఈ పాట చాలా బాగా వచ్చిందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమా ఆర్ ఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడట దేవి. ఎప్పుడు లేట్ గా ఇచ్చే దేవివ్రీ ఇంత ఫాస్ట్ గా ట్యూన్స్ ఇచ్చాడేంటా? అని యూనిట్ ఆశ్చర్యానికి గురయ్యారట. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడన్నట్టు ....దేవిశ్రీ ఏ పాట చేసినా తన మార్కుతో ఉంటూ శ్రోతలను ఆకట్టుకునేలా ఉంటుంది. ఏది ఏమైనా దేవిశ్రీ ఇచ్చిన ఈ స్వీట్ షాక్ కి నుంచి ఇంకా తేరుకోలేదట మహర్షి టీమ్.