89 సెన్సార్ కట్స్..ఉడ్తా పంజాబ్పై అంత పగేందుకు..?
on Jun 12, 2016
ప్రస్తుతం వివాదాల్లో నలుగుతున్న బాలీవుడ్ మూవీ ఉడ్తా పంజాబ్. పంజాబ్ రాష్ట్రంలో ఉన్న వ్యభిచారం, డ్రగ్స్ బ్యాక్డ్రాప్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా టైటిల్లో పంజాబ్ను యాడ్ చేసి ఆ మా రాష్ట్రాన్ని అవమానిస్తారా..? అంటూ శిరోమణి అకాళీదళ్ మండిపడింది..టైటిల్లోంచి పంజాబ్ని తొలగించండి..అంటూ ఆల్టీమేటమ్ జారీ చేసింది. అటు సెన్సార్ బోర్డు కూడా ఈ సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం తెలిపిందట. హీరో, హీరోయిన్ బిహేవియర్ రియల్ డ్రగ్ అడిక్ట్స్ని తలపిస్తోందని..మరి బూతు కంటెంట్ ఎక్కువగా ఉండటంతో మొత్తం 89 కట్స్ చెప్పిందట సెన్సార్ బోర్డ్. అంతేనా టైటిల్లోని పంజాబ్ని తొలగించమని ఆర్డర్ వేసింది. మొత్తం సీన్లన్ని తీసేస్తే ఇక సినిమాలో మ్యాటరేం ఉంటుందంటూ చిత్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ బాంబే హైకోర్టును ఆశ్రయించడంతో దీనిపై రేపు న్యాయస్థానం విచారణ జరపనుంది.