చిరంజీవి పేరుతో కరోనా క్రైసిస్ చారిటీ అకౌంట్!
on Mar 31, 2020
ప్రస్తుత సంక్షోభ కాలంలో షూటింగ్లు నిలిచిపోవడం వల్ల దినసరి వేతనంతో బతికే కళాకారులు, కార్మికుల జీవితాలు అస్తవ్యస్తం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. వాళ్లను ఆదుకొనే నిమిత్తం చిరంజీవి చైర్మన్గా కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ) ఏర్పడిన విషయం తెలిసిందే. చిరంజీవి స్వయంగా దీనికి రూ. 1 కోటి విరాళం అందించగా, పలువురు హీరోలు, నటులు ఈ చారిటీకి తమ వంతు విరాళాలు అందించారు. ఇప్పటికి ఆ విరాళాలు రూ. 6.2 కోట్లకు చేరుకున్నాయి. ఈ విషయాన్ని చిరంజీవి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప్రకటించారు.
"కరోనా క్రైసిస్ చారిటీకి ఇప్పటి వరకూ రూ. 6.2 కోట్లు వచ్చాయి. ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా థాంక్స్ చెబుతున్నా. ఈ పనికి ముందుకు రావాల్సిందిగా అందరినీ కోరుతున్నా" అని ఆయన పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చారు. ఇది చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఉండటం గమనార్హం. 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ - కరోనా క్రైసిస్ చారిటీ' అనే అకౌంట్ పేరుతో ఐసీఐసీఐ బ్యాంక్, జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో ఒక అకౌంట్ను తెరిచారు. కాగా 'ఈ చారిటీ అకౌంట్కు మీ పేరుందుకు చిరంజీవి గారూ..?' అంటూ కొంతమంది ట్రోల్స్ చేయడం కనిపించింది.
Also Read