పరశురామ్తోటే ఖాయం!
on Mar 23, 2020
మహేశ్ ఏ డైరెక్టర్తో సినిమా చేస్తాడనే విషయానికి ఇక తెరపడినట్లే. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తన 27వ సినిమాని అతను చేయడం లేదని స్పష్టమైనాక పరశురామ్, సందీప్రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్లలో ఎవరో ఒకరితో చేస్తాడని ప్రచారంలోకి వచ్చింది. ఆఖరుకి 'గరుడవేగ' డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు పేరు సైతం వినిపించింది. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ఒక ప్రత్యేక పాత్ర చేయడానికీ మహేశ్ సిద్ధమయ్యాడు. కానీ ఆఖరుకు ఆ సినిమా తప్పిపోయింది. ఈలోగా కరోనా వ్యాప్తి దెబ్బకు సినిమా హాళ్ల మూసివేత, సినిమా షూటింగ్ల నిలిపివేత జరిగిపోయాయి. దీంతో సామాజిక దూరం పాటించి, కరోనా వ్యాప్తిని అడ్డుకోండంటూ సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తూ వచ్చాడు మహేశ్. తను కూడా ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతూ వస్తున్నాడు.
ఇప్పడు లేటెస్ట్గా మహేశ్ తర్వాతి సినిమాపై క్లారిటీ వచ్చింది. పరశురామ్ డైరెక్షన్లోనే తన 27వ చిత్రాన్ని చేయడానికి మహేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆ ఇద్దరి కాంబోను సెట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ సన్నిహిత వర్గాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. నిజానికి ఉగాది సందర్భంగా మార్చి 25న ఈ మూవీపై అధికారిక ప్రకటన వెలువరిద్దామని అనుకున్నారనీ, కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వచ్చే నెలలో ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేయవచ్చని ఆ వర్గాలు తెలిపాయి. అయితే ఉగాదికి అనౌన్స్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని కూడా అవి చెప్తున్నాయి. ఈ మూవీలో హీరోయిన్గా కియారా అద్వానీ లేదా పూజా హెగ్డే నటించే అవకాశాలు ఉన్నాయి.
Also Read