హాస్యనటుడు అలీకి మాతృ వియోగం
on Dec 19, 2019
ప్రముఖ హాస్యనటుడు అలీ తల్లి జైతన్ బీబీ (75) బుధవారం రాత్రి 11:41 గంటలకు కన్నుమూశారు. అనారోగ్యంతో రాజమండ్రిలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె అక్కడే తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో అలీ ఒక సినిమా షూటింగ్ సందర్భంగా రాంచీలో ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఆయన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. మరోవైపు రాజమండ్రి నుంచి జైతన్ బీబీ పార్థివదేహాన్ని నేటి ఉదయం హైదరాబాద్లోని అలీ ఇంటికి తీసుకువచ్చారు. చిరంజీవి సహా పలువురు చిత్రసీమ ప్రముఖులు జైతన్ పార్థివదేహాన్ని సందర్శించి ఆమెకు శ్రద్ధాంజలి ఘటించారు. 'మా' అధ్యక్షుడు నరేశ్, డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె. అచ్చిరెడ్డి, నటుడు శివబాలాజీ తదితరులు వారిలో ఉన్నారు.