టెన్షన్లో బచ్చన్ ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్
on Jul 13, 2020
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి కరోనా వస్తుందని ఎవరూ ఊహించలేదు. అమితాబ్, అభిషేక్ కరోనా బారిన పడ్డారని ఆందోళన చెందిన అభిమానులు... అభిషేక్ భార్య, ప్రముఖ కథానాయిక ఐశ్వర్య, ఈ దంపతుల కుమార్తె ఆరాధ్యకు కరోనా లేదని కాస్త ఊరట చెందారు. ఆ ప్రశాంతత పదిమందికి చేరేలోపు పిడుగులాంటి న్యూస్. తరవాత రోజుకి ఐశ్వర్య, ఆరాధ్య కరోనా బారిన పడ్డారు. జయాబచ్చన్ మినహా మిగతా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కరోనా పాజిటివ్ గా తేలారు. దాంతో బచ్చన్ ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్ టెన్షన్ పడుతోంది.
అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి ముంబైలో భారీ భవంతి ఉంది. ఆ లంకంత కొంపలోకి ఎవరుపడితే వాళ్ళు వెళ్ళడానికి, రావడానికి వీలు పడదు. కేవలం సన్నిహితులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నా, కొన్ని పరీక్షలు చేసిన అనంతరం అనుమతించారట. అటువంటిది బచ్చన్ ఫ్యామిలీకి కరోనా రావడంతో గత పది, పదిహేను రోజుల వ్యవధిలో బచ్చన్ కుటుంబ సభ్యులను కలిసిన వాళ్లు, కరోనా టెస్టులకు రెడీ అవుతున్నారు.
అభిషేక్ బచ్చన్ 'బ్రీత్: ఇన్టు ద షాడోస్' వెబ్ సిరీస్ లో నటించిన అమిత్ సద్, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నప్పటికీ... కొవిడ్19 టెస్టు చేయించుకుంటానని చెప్పాడు. అలాగే, బచ్చన్ ఫ్యామిలీతో సన్నిహితంగా మెలిగిన మిగతావాళ్ళూ కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు.
Also Read