'గీత గోవిందం' సక్సెస్మీట్.. చిరు వార్నింగ్.!!
on Aug 20, 2018
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా పరశురామ్ దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మించిన ‘గీత గోవిందం’ సక్సెస్మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.. ఈ సక్సెస్మీట్ కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు.. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ 'ఖైదీతో నాకు స్టార్ స్టేటస్ వచ్చినట్టే ఈ చిత్రంతో విజయ్ స్టార్ అయ్యాడు.. ఇప్పుడు టాప్ స్టార్స్లో తనూ ఒకడయ్యాడు.. తనని స్వాగతిస్తున్నా.. ప్రేక్షకుల కేరింతల్ని తలలో కాకుండా గుండెల్లో పెట్టుకుంటే, వాళ్లూ తనని గుండెల్లో పెట్టుకుంటారు.. మన ఇండస్ట్రీకి దక్కినటువంటి మరో అరుదైన వర్సటైల్ స్టార్ విజయ్ దేవరకొండ’ అన్నారు.
అదే విధంగా విడుదలకు ముందు 'గీత గోవిందం' ఫుటేజ్ లీక్ అయిన విషయం తెలిసిందే.. దీనిపై స్పందించిన చిరంజీవి లీక్ చేయటం తప్పంటూ గట్టిగా హెచ్చరించారు.. 'అరవింద్గారు సినిమా లీకైందని చెప్పినప్పుడు.. మీరేం వర్రీ కాకండీ, మా తమ్ముడు పవన్కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమా కూడా ఇలాగే లీకైంది.. అది విజయానికి ఆటంకం కాదు.. సెంటిమెంట్ అనుకోండి అని ఊరట కలిగించడానికి చెప్పా.. అయితే, కోట్లు ఖర్చుపెట్టి తీసిన సినిమాను స్నేహితులకు చూపించడానికి కుర్రతనంతో లీక్ చేయడం ఎంతవరకూ సబబు? ఇదేం న్యాయం? చిత్ర పరిశ్రమ ఎందరికో తల్లిలాంటిది.. ఇక్కడ పని చేసే వ్యక్తులు చిత్రాన్ని దొంగిలించి షేర్ చేస్త్తున్నారంటే, కొన్ని కోట్లను దొంగతనం చేస్తున్నట్టే.. ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తున్నా.. ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతున్నట్లే అని గుర్తుంచుకోండి’ అని చిరంజీవి అన్నారు.