'ఓ పిట్ట కథ'కు మెగాస్టార్ సపోర్ట్
on Feb 28, 2020
భారీ చిత్రాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న భవ్య క్రియేషన్స్ సంస్థ తొలిసారిగా కొత్త తారలతో, కొత్త దర్శకుడితో నిర్మించిన సరికొత్త కంటెంట్ ఫిల్మ్ 'ఓ పిట్ట కథ'. విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యా శెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం మార్చి 6న రిలీజ్ కానుంది. బ్రహ్మాజీ ఒక కీలక పాత్ర చేశారు. చెందు ముద్దు దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్లో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ని గ్రాండ్గా చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొనబోతుండటం విశేషం.
ఈ విషయాన్ని నిర్మాత వి. ఆనందప్రసాద్ తెలియజేస్తూ, "కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి రెస్సాన్స్ లభిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్" అన్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీకి సునీల్ కుమార్ ఎన్. సినిమాటోగ్రాఫర్.