అప్పుడు బన్నీ గెస్ట్.. ఇప్పుడు చిరు గెస్ట్..
on Jun 12, 2021
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటించిన `శంకర్ దాదా జిందాబాద్`(2007) చిత్రంలో ``జగదేక వీరుడికి అతిలోక సుందరికి`` అంటూ సాగే పాటలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాసేపు తళుక్కున
మెరవడం గుర్తుండే ఉంటుంది. ఇలా.. బన్ని గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అప్పట్లో మెగాభిమానులను మురిపించింది. కట్ చేస్తే.. 14 ఏళ్ళ తరువాత ఇప్పుడు బన్ని సినిమాలో చిరు ఇలానే సరాదాగా కాసేపు
సందడి చేయనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో `ఆర్య`, `ఆర్య 2` తరువాత అల్లు అర్జున్ మరోమారు జట్టుకట్టిన సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రూపొందుతున్న ఆ చిత్రమే `పుష్ప`.
కాగా, ఇందులో మెగాస్టార్ నర్తించిన ఓ పాపులర్ సాంగ్ ని రీమిక్స్ చేయబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రచారం సాగింది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `పుష్ప` మొదటి భాగంలో చిరంజీవి ఓ మాస్ మసాలా సాంగ్ లో తళుక్కున మెరవనున్నారట. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `శంకర్ దాదా జిందాబాద్`కి సంగీతమందించిన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ నే ఇప్పుడు `పుష్ప`కి కూడా స్వరకర్త. మరి.. `పుష్ప`లో చిరు గెస్ట్ రోల్ పై వస్తున్న వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే, ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతున్న `పుష్ప`లో రష్మిక మందన్న నాయికగా నటిస్తుండగా.. ఫాహద్ ఫాజిల్ విలన్ గా దర్శనమివ్వనున్నాడు.
Also Read