గుండు లుక్ వెనుక అసలు కథ చెప్పిన చిరంజీవి
on Sep 24, 2020
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గుండుతో కనిపించారు. 'అర్బన్ మాంక్' అంటూ బాల్డ్ హెడ్ ఫోటోలు, వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేశారు. ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యంలోకి నెట్టారు. అయితే, ఆయన నిజంగా గుండు చేయించుకోలేదు. ప్రొస్థటిక్ మేకప్ మాయతో ఆ లుక్ లోకి వచ్చారు. దాన్ని వీడియో తీసి విడుదల చేశారు కూడా! ఇప్పుడు ఆ లుక్ వెనుక అసలు కథను చిరంజీవి చెప్పుకొచ్చారు.
'వేదాళం' రీమేక్ కోసం గుండు లుక్ ఎలా ఉంటుందని చిరంజీవి ట్రై చేశారట. అయితే ఇంకా ఆ లుక్ ను ఫైనలైజ్ చేయలేదని ఆయన అంటున్నారు. 'శివాజీ' సినిమాలో రజనీకాంత్ లుక్ తో పోలుస్తారు ఏమో అని ఆలోచిస్తున్నారట. ప్రస్తుతానికి ఆ లుక్ సినిమాలో ఉంటుందో లేదో చెప్పడం సందేహమే.
ప్రస్తుతం చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళం', వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'లూసిఫర్' రీమేక్స్ చేయనున్నారు. అలాగే 'ఆచార్య'లో రామ్ చరణ్ నటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read