‘ఛల్ మోహన్రంగ’ టీజర్ రివ్యూ.. మూడు ముక్కల్లో స్టోరీ...
on Feb 14, 2018
నితిన్, మేఘా ఆకాశ్ కలిసి గతంలో "లై" సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో కూడా అందరికీ తెలిసిందే. మళ్లీ ఇప్పుడు సేమ్ కాంబినేషన్ ‘ఛల్ మోహన్రంగ’ సినిమాతో తెరపైకి రానుంది. ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ ఇటీవలే రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు టీజర్ ప్రేమికుల రోజు సందర్భంగా టీజర్ ని విడుదుల చేసారు. ఇక ఈ టీజర్లో మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నితిన్ చెప్పిన డైలాగ్స్ హైలెట్ గా నిలిచాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అఫీషియల్ సినిమా ట్విట్టర్ అకౌంట్ పీకే క్రియేటివ్ వర్క్స్ ద్వారా ఛల్ మోహన్ రంగ టీజర్ ను విడుదల చేశారు. మరి టీజర్లోకి ఓ లుక్కేస్తే... నీ స్టోరీ ఏంటి బయ్యా అని నితిన్ ని ఓ వ్యక్తి అడుగగా. దానికి నితిన్... 'మేమిద్దరం వర్షా కాలంలో కలుసుకున్నాం.. శీతాకాలంలో ప్రేమించుకున్నాం. వేసవి కాలంలో విడిపోయాం' అని నితిన్ అంటాడు. మీరిద్దరూ వెదర్ రిపోర్టర్సా బయ్యా అంటూ అవతలి వ్యక్తి అనడం మంచి హాస్యాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాలో నితిన్ గతంలోకంటే కాస్త డిఫరెంట్గా ఉన్నాడు.. దీంతో ప్రేమికుల రోజు ఫర్ఫెక్ట్ టీజర్ అని.. అప్పుడే ప్రశంసలు మొదలయ్యాయి. మరి టీజర్ అయితే అందరికీ నచ్చింది.. సినిమా ఎంత వరకూ నచ్చుతుందో తెలియాలంటే.. ఏప్రిల్ 5 వరకూ ఆగాల్సిందే.