సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిపై కేసు పెట్టిన సిబిఐ
on Aug 7, 2020
బాలీవుడ్ లేటెస్ట్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మర్డర్ మిస్టరీ మరో కొత్త మలుపు తీసుకుంది. అతను ఆత్మహత్య చేసుకున్నప్పటినుంచీ హీరోయిన్ రియా చక్రవర్తిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజా పరిణామాలు సైతం ఆమెను అభిమానించేలా చేస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే...
సుశాంత్ కుటుంబ సభ్యులు సహా బీహార్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేసులో సీబీఐ విచారణ కోరడంతో కేంద్రం అనుమతించిన సంగతి తెలిసిందే. ఆల్రెడీ రంగంలోకి దిగిన సిబిఐ విచారణ మొదలు పెట్టింది. సుశాంత్ డైరీలో కొన్ని పేజీలు మిస్సింగ్ అయినట్టు గుర్తించింది. అందుకు రియా చక్రవర్తిపై కేసు నమోదు చేసింది. ఆమెతో కుటుంబ సభ్యులు సహా మరో ఐదుగురిపై కేసు పెట్టారు. మిస్ అయిన పేజీలను రియా చేసినట్టు పలువురు అనుమానిస్తున్నారు. సుశాంత్ కి తమను ను దూరం చేసినట్టు ఇప్పటికే అతని కుటుంబ సభ్యులు రియా చక్రవర్తిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ బ్యాంకు ఖాతాలో డబ్బులను అక్రమంగా ఇతర ఖాతాలకు మళ్ళించి ఉందనే ఆరోపణలు సైతం ఆమెపై ఉన్నాయి.