బన్నీ వద్దన్నాడు.. విశాల్ రమ్మన్నాడు!
on Jun 27, 2016
తమిళ దర్శకుడు లింగుస్వామి పరిస్థితి "రెంటికీ చెడ్డ రేవడి"లా తయారయ్యింది. సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన "అంజాన్" (తెలుగులో "సికిందర్") డిజాస్టర్ గా నిలవడంతో లింగుస్వామిని పట్టించుకొనే నాధుడే లేకుండాపోయాడు. తన పరపతి మొత్తం ఉపయోగించి.. అల్లు అర్జున్ కి ఒక కథ చెప్పి ఒకే చేయించుకొన్న లింగుస్వామి గత కొన్ని నెలలుగా ఆ కథపై వర్క్ చేస్తూ వస్తున్నాడు. అల్లు అర్జున్ కూడా "తర్వాత సినిమా నీదే" అని ప్రతి సినిమా తర్వాత చెప్పడంతో ఇక విసిగిపోయిన్ లింగుస్వామి మళ్ళీ తమిళనాడుకు పయనమైనట్లు తెలుస్తోంది.
నిజానికి "సికిందర్" అనంతరం విశాల్ హీరోగా "పందెం కోడి" సీక్వెల్ ను తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకొన్నాడు లింగుస్వామి, కానీ అల్లు అర్జున్ సినిమా ఒకే చేయడంతో విశాల్ సినిమా పక్కన పెట్టేశాడు లింగుస్వామి. ఇప్పుడు అల్లు అర్జున్ హ్యాండ్ ఇవ్వడంతో మళ్ళీ విశాల్ పంచన చేరాడు. ఈ సీక్వెల్ ఈ ఏడాది చివర్లో మొదలుకానుంది!