శ్రీదేవి ట్వీటర్ నుండి బోని ట్వీట్...
on Mar 1, 2018
అందాల తార శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే కదా. శ్రీదేవి మరణం దేశం మొత్తాన్ని కలిచివేసింది. ఇక శ్రీదేవి కుటుంబం అయితే తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఈ నేపథ్యంలోనే శ్రీదేవి భర్త బోనికపూర్ ఆమె గురించి చెబుతూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. అది కూడా శ్రీదేవి ట్విట్టర్ నుండి.
‘ఆమె ఈ ప్రపంచానికి చాందినీ.. నాకు మాత్రం ఆమే సర్వస్వం.. నా ప్రేమ. ఓ స్నేహితురాలు, భార్య, ఇద్దరు కూతుళ్ల తల్లిని కోల్పోయాను. ఆమె లేని లోటు మాటల్లో వర్ణించలేను’ అని బోనీ కపూర్ శ్రీదేవి ట్వీటర్ ఖాతా నుంచి ట్వీట్ చేశారు. శ్రీదేవి మృతిచెందిన తర్వాత ఆమె ట్వీటర్ నుంచి పోస్టయిన తొలి ట్వీట్ ఇది. ఈ బాధాకర సమయంలో అర్జున్ కపూర్, అన్షుల నా వెంట నిలబడి.. నాకు, జాన్వికి, ఖుషికి ఎంతో ధైర్యాన్నిచ్చారు’ అని.. తన ఇద్దరు కూతుళ్లు జాన్వి, ఖుషిలను జాగ్రత్తగా చూసుకోవడమే తన ప్రథమ కర్తవ్యమని అన్నారు. సినీ తారల జీవితానికి తెర పడదని, వెండితెరపై వారెప్పుడూ సజీవంగానే ఉంటారని శ్రీదేవి మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నా.. శ్రీదేవి వెండితెరపై ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది.. నేడు భౌతికంగా ఆమె మన మధ్య లేదు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్లో రాసుకొచ్చారు బోనీ కపూర్. ఇప్పుడు ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.