మేనల్లుడితో ‘మెగా’ మల్టీస్టారర్?
on Aug 6, 2020
మెగా ఫ్యామిలీలో అరడజను కంటే ఎక్కువమంది స్టార్ హీరోలు ఉన్నారు. అయితే, ఇప్పటిరవకూ మెగా హీరోల నుండి మల్టీస్టారర్ సినిమాలు రాలేదు. చిరంజీవి ‘శంకర్దాదా’లో పవన్ కల్యాణ్ కనిపించడం, రామ్చరణ్ ‘మగధీర’లో మెగాస్టార్ తళుక్కున మెరవడం తప్పితే పెద్దగా కలిసి నటించలేదు. ‘ఎవడు’లో అల్లు అర్జున్ కాస్త లెంగ్త్ ఉన్న రోల్ చేశాడని చెప్పాలి. ఇప్పుడు మెగాస్టార్ ‘ఆచార్య’లో రామ్చరణ్ ఓ రోల్ చేస్తున్నాడు. ఇంకా ఆ షూటింగ్ కంప్లీట్ కాలేదు. అది కాకుండా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్తో కలిసి మెగాస్టార్ మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యారా? అంటే ‘అవును’ అని ఫిలింనగర్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
‘పవర్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జై లవకుశ’, ‘వెంకీమామ’ చిత్రాల దర్శకుడు కేఎస్ రవీంద్ర (బాబీ)తో మెగాస్టార్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇటీవల చిరంజీవిని కలిసిన దర్శకుడు, ఒక మల్టీస్టారర్ స్టోరీ నేరేట్ చేశాడట. చిరంజీవి కాకుండా మరో హీరో పాత్రకు సాయి ధరమ్ తేజ్ అయితే బావుంటుందని అనుకుంటున్నారట. ‘వెంకీమామ’లో మామాఅల్లుళ్లును బాగా చూపించిన బాబీ, ఈ సినిమానూ బాగా డీల్ చేస్తాడని మెగాస్టార్ బావిస్తున్నారట.