నష్టపరిహారానికి కంగన అర్హురాలు కాదు.. బీఎంసీ అఫిడవిట్!
on Sep 19, 2020
ముంబైలోని తన ఆఫీస్ను కూలగొట్టడాన్ని సవాలు చేస్తూ, బీఎంసీ నుంచి నష్టపరిహారంగా రూ. 2 కోట్లు ఇప్పించాలని కోరుతూ కోర్టులో కంగనా రనౌత్ వేసిన పిటిషన్కు సమాధానంగా బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో "పిటిషనర్ (కంగన) అపరిశుభ్ర చేతులతో కోర్టును ఆశ్రయించారు. నిజాలను తొక్కిపెడుతున్నారు.. ఎలాంటి పరిహారానికి ఆమె అర్హురాలు కారు" అని బీఎంసీ పేర్కొంది.
సెప్టెంబర్ 8న కంగనకు "స్టాప్ వర్క్" నోటీస్ను జారీ చేసిన బీఎంసీ అందులో ఆమె ఆఫీస్ మణికర్ణిక ఫిలిమ్స్లోని అన్ని అనధికార మార్పుల జాబితాను పేర్కొంది. సమాధానం కోసం 24 గంటల గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 9న కూల్చివేత పనులు మొదలుపెట్టారు. బాంబే హైకోర్టు స్టే విధించడంతో కూల్చివేతను నిలిపివేశారు.
కంగన రనౌత్కు మద్దతు ప్రకటించిన ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ అక్రమ మార్పులంటూ ఆమె ఆఫీస్ను బీఎంసీ కూల్చివేయడాన్ని ఖండించింది. సోషల్ మీడియాలో పలువురు సైతం బీఎంసీ చర్యను ఖండించారు.