సుశాంత్ కేసులో సల్మాన్కి ఊరట
on Jul 15, 2020
సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్కి ఓ విధంగా ఊరట లభించింది. ఆ కేసుకు, ఆయనకు అసలు సంబంధం లేదు. కానీ, చాలామంది సుశాంత్ ఆత్మహత్యకు సల్మాన్ కారణమని ఆరోపించారు. ట్విట్టర్లో ట్రోల్ చేశారు. ఎవరెన్ని విమర్శలు చేసినా సల్మాన్ స్పందించలేదు. సుశాంత్ అభిమానులకు అండగా ఉండమని, బాధలో వారేమన్నా పట్టించుకోవద్దని పిలుపు ఇచ్చాడు. అయితే, సోషల్ మీడియా ట్రోల్స్, కొన్ని విమర్శల నేపథ్యంలో కొంతమంది సల్మాన్ను పోలీసులు ప్రశ్నించవచ్చనే ప్రచారం జరిగింది. కేసు విచారిస్తున్న డీసీపీ సదరు ప్రచారాన్ని కొట్టివేశారు.
జూన్లో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలీ, ఏక్తా కపూర్ సహా మరికొంతమందిపై బీహార్లో కేసు వేశారు. సంజయ్ లీలా భన్సాలీని పోలీసులు విచారించారు కూడా! అయితే... ఈ విచారణకు, ఆ కేసుకు సంబంధం లేదు. కానీ, సల్మాన్ను విచారించవచ్చని భావించారంతా! చివరకు, ఆయనకు ఊరట లభించింది. గతంలో సల్మాన్ దగ్గర పని చేసిన మేనేజర్ రేష్మా శెట్టి విచారణ ఎదుర్కొన్నారు. ఇప్పటివరకూ ఈ కేసులో 35 మందిని పోలీసులు విచారించారు.