హీరోగా బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు
on Aug 19, 2019
బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ ని హీరోగా `అల్లుడు శ్రీను` సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు. తాను నాలుగైదు సినిమాలు చేసినా ఏ సినిమా పెద్దగా ఆడలేదు. ఇటీవల చేసిన `రాక్షసుడు` సినిమా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి శ్రీనివాస్. ఇదిలా ఉంటె బెల్లకొండ తన రెండో కుమారుడు సాయి గణేష్ ని హీరో గా పరిచయం చేస్తూ పవన్ సాధినేని డైరేక్షన్ లో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో కూడా బెల్లం కొండ సురేష్ తన రెండో కుమారుడు హీరో గా సినిమా చేయబోతున్నట్లు హింట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమా లవ్ స్టోరీ గా తెరకెక్కనున్నట్లు సమాచారం. బెక్కం వేణుగోపాల్ తో కలిసి బెల్లంకొండ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. దసరాకు ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. మరి సాయి శ్రీనివాస్ ని కమర్షియల్ హీరోగా నిలబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి సన్ స్ట్రోక్ తెచ్చుకున్న సురేష్ తన రెండో కొడుకు విషయం లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అంటున్నారు సినీ జనాలు.