బెల్లంకొండ సినిమాల్లో కొత్త హీరోయిన్లు?
on Dec 6, 2018
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తొలి సినిమా 'అల్లుడు శీను'లో సమంత హీరోయిన్. ఐటమ్ సాంగులో తమన్నా సందడి చేసింది. రెండో సినిమా 'స్పీడున్నోడు'లో స్టార్ హీరోయిన్ లేదు కానీ... మరోసరి ఐటమ్ సాంగులో తమన్నా సందడి చేసింది. మూడు సినిమా 'జయ జానకి నాయక'లో రకుల్ హీరోయిన్ అయితే... కేథరిన్ ఐటెమ్ సాంగులో సందడి చేసింది. ప్రగ్యా జైస్వాల్ మరో హీరోయిన్గా నటించింది. నాలుగో సినిమా 'సాక్ష్యం'లో పూజా హెగ్డే... ఐదో సినిమా 'కవచం'లో కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోయిన్లు. బెల్లకొండ సాయి శ్రీనివాస్ సినిమా అంటే స్టార్ హీరోయిన్లు తప్పకుండ వుంటారని ప్రేక్షకులూ ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే.. .ఇకపై తన సినిమాల్లో కొత్త హీరోయిన్లు కనిపించే అవకాశం వుంటుందని ఈ హీరో చెబుతున్నాడు. "స్టార్ హీరోయిన్ సినిమాలో వుంటే మార్కెట్ పరంగా బావుంటుంది. బడ్జెట్ని బట్టి హీరోయిన్ని ఎంపిక జరుగుతుంది. ఇప్పటికే సమంత, తమన్నా, రకుల్, పూజా హెగ్డే, కాజల్ వంటి స్టార్ హీరోయిన్లతో నటించా. ఇకపై కొత్తవాళ్లతో చేయాలేమో?" అని బెల్లకొండ సాయి శ్రీనివాస్ అన్నాడు. 'సాక్ష్యం' పరాజయంతో రెండు రోజులు ఇంటి నుంచి బయటకు రాలేదని చెప్పిన ఈ హీరో.. 'కవచం' తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పాడు.