పవన్, బాలయ్యలను ‘టచ్ చేసి చూడ’మంటున్న రవితేజ!
on Dec 15, 2017
బాలకృష్ణ - రవితేజ, పవన్ కల్యాణ్ - రవితేజ...సిననీ ప్రపంచంలో... ఎక్కడైనా... ఈ రెండు జంటల ప్రస్తావన తస్తే.. రకరకాలుగా కథలు పుట్టుకొస్తాయ్. రవితేజను స్టార్ ని చేసిన సినిమాలు ఇడియట్, అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయ్. ఈ రెండు కథలూ.. ముందు వపన్ కల్యాణ్ దగ్గరకొచ్చి తిరస్కరణకు గురై... తుదకు రవితేజ దగ్గరకెళ్లాయ్.. రవితేజను ఇప్పుడందరూ ‘మాస్ మహరాజా’ అంటున్నారంటే.. ఈ రెండు సినిమాల చలవే. ఇక బాలయ్య - రవితేజ... వీరిద్దరి టాపిక్ వస్తే... ఓ అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వెలుగు చూస్తుంది. అది ఫిలిం సర్కిల్స్ లో అందరికీ తెలిసిన స్టోరీనే. ఇప్పుడు ఈ టాపిక్కులు దేనికంటే.. ఏ హీరో వదిలేసిన కథల్ని ఎంచుకొని రవితేజ స్టార్ అయ్యాడో.. ఏ హీరో తో రవితేజకు వ్యక్తిగతంగా విబేధాలున్నాయని ఫిలింసర్కిల్స్ లో టాక్ ఉందో... ఆ ఇద్దరు హీరోల సినిమాలకు రవితేజ పోటీ పడబోతున్నాడు. అందుకే ఈ గోలంతా. అవును.. రాబోతున్న సంక్రాంతికి పవన్ కల్యాణ్, బాలయ్యలతో పాటు రవితేజా కూడా పోటీలో నిలువనున్నాడట. పవర్ స్టార్ ‘అజ్ఙాతవాసి’ జనవరి 10న విడుదలవుతుంటే... నటసింహం ‘జై సింహ’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీరిద్దర్నీ జనవరి 13న ‘టచ్ చేసి చూడు’ అనబోతున్నాడు రవితేజ. అవును. ఓ విధంగా మాస్ మహారాజా సంక్రాంతికి పెద్ద సాహసమే చేస్తున్నాడనాలి. వీరిద్దరి సినిమాలతో పోటీ పడటం వల్ల... వసూళ్ల పరంగా, థియేటర్ల పరంగా కూడా సమస్యలు వాటిల్లే ప్రమాదం ఉంది. కానీ... కేర్ చేయకుండా జనవరి 13న వచ్చేస్తున్నాడు రవితేజ. ‘రాజా ది గ్రేట్’ ఇచ్చిన ఉత్సాహమే ఈ ధైర్యానికి కారణం కావొచ్చు. ఇప్పటికే ఈ సిినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇంకా నెల రోజుల గడువు ఉంది కాబట్టి... ఈ సమయంలో ప్రమోషన్ భారీ ఎత్తులో ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు విక్రమ్ సిరికొండ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సంక్రాంతికే సూర్య డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’ కూడా విడుదల కానుంది. మరి విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.