బాలయ్య కావాలనే ఎన్టీఆర్ని పట్టించుకోలేదా!!!
on Oct 22, 2018
నందమూరి హరికృష్ణ మరణానంతరం బాలయ్య ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లకు తండ్రి స్థానంలో ఉంటూ వచ్చాడు. దీంతో అంతా కలిసిపోయారు. ఇక ఇటీవల ఎన్టీఆర్ నటించిన `వీర రాఘవ సమేత` చిత్రం విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా అరవింద సమేత సక్సెస్ ఫంక్షన్ కు బాలయ్య ముఖ్య అతిథిగా వచ్చాడు. ఎప్పుడైతే బాలయ్య ఈ వేడుకకు వస్తున్నాడని తెలిసిందో అప్పటి నుంచి బాబాయ్ -అబ్బాయ్ లు ఒకే వేదిక మీదంటూ సోషల్ నెట్ వర్క్స్ లో వార్తలు హల్ చల్ చేశాయి. అన్నట్టుగానే నందమూరి హీరోలు ఒకే వేదక పై మెరిసారు. వారిని కళ్లారా చూసి ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇక నందమూరి హీరోలకు తిరుగు లేదనుకున్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య తన ప్రసంగంలో `` నేను మన జూనియర్ ఎన్టీఆర్ ..మేం చేసే సినిమాలు మరే ఇతర హీరోలు చేయలేరు. ఎందుకంటే అవి లార్జర్ దేన్ లైఫ్ క్యారక్టర్స్ `` అంటూ చెప్పుకొచ్చాడు.
దర్శకుడు, సంగీత దర్శకుడు, ఫైట్ మాస్టర్స్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరినీ పొగిడిన బాలయ్య ఎన్టీఆర్ గురించి ఆ ఒక్క ముక్క తప్ప ఇంకొక్క ముక్క చెప్పకపోవడంతో అటు ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ కూడా నిరుత్సవాహపడ్డట్టుగా తెలుస్తోంది. అభిమానులైతే మరోసారి బాలయ్య తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తారక్ మాత్రం బాబాయ్ బాలయ్యను ఆకాశానికెత్తాడు. తండ్రి స్థానంలో నిలబడి తనను ముందుకు నడిపించాలని కోరుకున్నాడు. ఈ వేడుకకు వచ్చినందుకు పాదాభివందనాలు అన్నాడు . కానీ బాలయ్యలో మాత్రం అంత స్వచ్చమైన ప్రేమ కనిపించలేదు. కావాలనే ఎన్టీఆర్ ని పట్టించుకోలేదా? లేకుంటే ఎప్పటిలా బాలయ్య ప్రసంగాలు ఎక్కడో మొదలయ్యి ఎక్కడికో వెళ్తుంటాయి. అలా బాలయ్య ఎన్టీఆర్ గురించి ఎక్కువగా మాట్లాడలేకపోయాడా? అన్నది ప్రశ్నగా మిగిలింది. ఏది ఏమైనా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంలో చాలా హర్ట్ అయ్యారట.