అత్తారింటికి నాగిరెడ్డి పురస్కారం
on Apr 21, 2014
ప్రతి ఏడాది ప్రఖ్యాత నిర్మాత బి.నాగిరెడ్డి పేరుతో ఉత్తమ వినోదాత్మక కుటుంబ కథా చిత్రాలకు పురస్కారాలు అందిస్తున్నారు. 2013వ సంవత్సరానికిగానూ ఈ అవార్డు "అత్తారింటికి దారేది" చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు లభించింది. ఆదివారం సాయంత్రం హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ అవార్డును బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు అందజేశారు. ఈ అవార్డు కింద రూ.లక్ష యాభై వేలు నగదు బహుమతితో పాటు ఓ జ్ఞాపికను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎస్.జానకి, వి.బి.రాజేంద్రప్రసాద్, వెంకటేష్, శైలజా కిరణ్, తనికెళ్ళ భరణి వంటి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.