‘అర్జున్ రెడ్డి’ తర్వాతే మహేశ్!
on Jan 22, 2018
మహేశ్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో సినిమా ఖరారైట్టేనా? ఈ ప్రశ్నకు సమాధానం ‘అవును’ అనే వస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ దాదాపు సెట్ అయినట్టే.
అయితే... ఎప్పుడు? అనేది మాత్రం కేవలం మహేశ్ చేతిలోనే ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూడగానే.. ఫోన్ చేసి మరీ... టీమ్ కి శుభాకాంక్షలు తెలిపాడు మహేశ్. సందీప్ నయితే... ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ తర్వత కొన్ని రోజులకే.. మహేశ్ కు సందీప్ ఓ కథ వినిపించినట్లు ఫిలింనగర్ లో ఓ వార్త హల్ చల్ చేసింది. మహేశ్ అంతరంగికులతో వాకబు చేయగా... అది నిజమే అని తేలింది.
అయితే... మహేశ్ ఇప్పుడు ‘భరత్ అను నేను’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. బ్రహ్మోత్సవం, స్పైడర్ డిజాస్టర్లతో సతమతమవుతున్న మహేశ్ కు ఇప్పుడు అర్జంట్ గా విజయం కావాలి. అభిమానులు కూడా మహేశ్ విజయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ‘భరత్ అను నేను’ ఆ లోటు తీరుస్తుందని ఆశిస్తున్నారంత. ఈ సినిమా తర్వాత పైడిపల్లి వంశీ సినిమా చేస్తాడు మహేశ్. ఆ సినిమా తర్వాత సందీప్ సినిమా ఉంటుందని విశ్సనీయ సమాచారం.
‘భరత్ అను నేను’, పైడిపల్లి వంశీ సినిమాలు పూర్తికావడానికి గట్టిగా ఓ ఏడాది పట్టే అవకాశం ఉంది. ఈ లోగా ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు సందీప్. ఈ విషయాన్ని మహేశ్ సతీమణి నమ్రతతో కూడా చెప్పాడట ఆయన. నమ్రత కూడా అందుకు అంగీకారం తెలపడంతో ‘అర్జున్ రెడ్డి’ హిందీ రీమేక్ పనుల్లో బిజీ అయిపోయాడు సందీప్. అర్జున్ కపూర్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక... మహేశ్, సందీప్సినిమా పట్టాలెక్కుతుందనేది విశ్వసనీయ సమాచారం.