కరోనా ఎఫెక్ట్: ఆ సినిమాను ఆన్లైన్లో చుస్తున్నారంతా!
on Apr 7, 2020
బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ క్యాన్సర్ను జయించిన తర్వాత నటించిన సినిమా 'అంగ్రేజీ మీడియం'. ఇర్ఫాన్ అయితే క్యాన్సర్ను జయించాడు కానీ, అతడి సినిమా మాత్రం కరోనాకు బలైపోయింది. గత నెల 13న ఈ 'అంగ్రేజీ మీడియం' విడుదలైంది. ఓపెనింగ్స్ మీద కరోనా ఎఫెక్ట్ చూపించిందని మొదట బాధ పడితే... మూడు రోజుల తర్వాత మొత్తం థియేటర్లు మూత పడడంతో నిర్మాతలకు తీవ్ర నష్టం కలిగింది.
ప్రేక్షకులే కాదు, సినిమా ప్రముఖులు ఎవరూ విడుదలైన తొలి రెండు మూడు రోజుల్లో సినిమా చూడలేకపోయారు. ఇప్పుడు 'అంగ్రేజీ మీడియం' డిజిటల్లోకి వచ్చింది. హాట్ స్టార్ యాప్లో ఈ సినిమా రిలీజ్ అయింది. దాంతో అప్పుడు సినిమా మిస్ అయ్యామని అనుకున్నవారితో పాటు చాలామంది, ఇప్పుడు ఆన్లైన్లో చుస్తున్నారు.