విజయ్ సేతుపతితో 'రంగమ్మత్త' బాండింగ్ ఇదే!
on Dec 4, 2020
న్యూస్ రీడర్ నుంచి టీవీ షోల యాంకర్గా, ఆపైన సినీ నటిగా మారి, లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అనసూయ భరద్వాజ్. తెలుగు టీవీపై యాంకరింగ్కు గ్లామర్ను తీసుకొచ్చిన అతి కొద్దిమందిలో ప్రస్తుతం అగ్రస్థానం ఆమెదే. అందం, అభినయం కలబోతతో అలరిస్తూ వస్తున్న అనసూయ 'రంగస్థలం'లో రామ్చరణ్ పోషించిన చిట్టిబాబుకు రంగమ్మత్తగా నటించి, ఎంతగా మెప్పించారో మనకు తెలుసు. అంతకు ముందు 'క్షణం'లో నెగటివ్ రోల్లో రాణించిన ఆమె కెరీర్ను రంగమ్మత్త పాత్ర మరో మలుపు తిప్పింది.
లేటెస్ట్గా అనసూయ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన పిక్చర్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. అందులో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి సరసన నిల్చొని, ఒక చేయిని ఆయన భుజంపై పెట్టి, మరో చేతితో ఆయన చేతిని పట్టుకొని, కళ్లు మూసుకొని మరీ తెగ నవ్వేస్తున్నారు అనసూయ. ఆ పిక్చర్కు "Bonding with the brilliance. @actorvijaysethupathi Truly #makkalselvan" అనే క్యాప్షన్ పెట్టారు. దానికి హార్ట్ ఎమోజీని కూడా జోడించారు.
ఏ సందర్భంలో ఆ ఇద్దరు కలిశారో అందులో ఆమె తెలపలేదు. ఆ ఇద్దరూ కలిసి ఏదైనా సినిమాలో నటిస్తున్నారా? లేక ఏదైనా షో కోసం ఆయనను అనసూయ కలిశారా? అనే విషయం తెలియాల్సి ఉంది.
Also Read