కంటైన్మెంట్ ఏరియాగా మారిన అమితాబ్ నివాసం 'జల్సా'
on Jul 12, 2020
బిగ్ బి అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా'ను ఆదివారం కంటైన్మంట్ ఏరియాగా ప్రకటించిన బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్, దానిని సీజ్ చేసింది. శనివారం అమితాబ్, ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ ఇద్దరూ కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కాగా, ఆయన కుటుంబ సభ్యులైన జయా బచ్చన్, ఐశ్వర్యా రాయ్ తదితరుల టెస్ట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. శనివారమే అమితాబ్, అభిషేక్ ముంబైలోని ప్రఖ్యాత నానావతి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తమ ఆరోగ్య స్థితిని వాళ్లిద్దరూ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తమ ఇద్దరికీ స్వల్ప లక్షణాలు కనిపించాయని చెప్పిన అభిషేక్, అందరూ ప్రశాంతంగా ఉండాలనీ, పానిక్ కావద్దనీ విజ్ఞప్తి చేశాడు. నానావతి హాస్పిటల్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం అమితాబ్ను ఐసోలేషన్ వార్డుకు తరలించారు.
అమితాబ్, అభిషేక్ ఇద్దరూ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకున్నారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. "అమితాబ్జీకీ, అభిషక్కూ స్వల్పంగా లక్షణాలు కనిపించాయి. వాళ్లకు దగ్గు, జ్వరం వచ్చాయి. దాంతో ఇద్దరూ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ చేయించుకోగా కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వెంటనే అమితాబ్ తనంతట తాను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. తండ్రీ కొడుకులిద్దరూ నార్మల్గా ఉన్నారు" అని ఆయన చెప్పారు.
Also Read