బన్నీని చూడ్డానికి 250 కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు!
on Sep 23, 2020
అధికారం కోసం రాజకీయ నాయకులు పాదయాత్రలు చేస్తారు. పుణ్యక్షేత్రాలకు కొందరు భక్తులు కాలినడకన వెళతారు. అల్లు అర్జున్ అభిమాని ఒకరు అతణ్ణి చూడటానికి మాచర్ల నుండి హైదరాబాద్ వరకు 250 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తన అభిమాన హీరోని నేరుగా కలవడం కోసం, ఫొటో దిగడం కోసం ఈ పని చేశాడు. అసలు వివరాల్లోకి వెళితే...
బన్నీకి మాచర్లవాసి పి. నాగేశ్వరారావు వీరాభిమాని. ఎలాగైనా అభిమాన హీరోని కలిసి ఫొటో దిగాలని సెప్టెంబర్ 17న మాచర్ల నుండి హైదరాబాద్ కి పాదయాత్ర ప్రారంభించాడు. 'జై అల్లు అర్జున్ అన్నా... మాచర్ల టు హైదరాబాద్ పాదయాత్ర' అని ప్లకార్డు పట్టుకుని ఆరు రోజులు 250 కిలోమీటర్లు నడిచిన తరవాత మంగళవారానికి హైదరాబాద్, బంజారా హిల్స్ చేరుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. అదీ సంగతి!