అయ్యయ్యో... ఆలియా ఫాలోయర్లు మళ్ళీ తగ్గెనే!
on Oct 26, 2020
పాపం ఆలియా భట్! తనకు ఇన్స్టాగ్రామ్లో 50 మిలియన్ (5 కోట్ల మంది) ఫాలోయర్లు వచ్చారని సంతోషపడుతూ శనివారం నాడు ఒక పోస్ట్ పెట్టారు. అయితే, ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ప్రస్తుతం ఆమె ఇన్స్టా ఫాలోయర్లు 49.9 మిలియనే. అంటే... పోస్ట్ పెట్టిన తరువాత సుమారు లక్ష మంది తగ్గారు అన్నమాట.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత అలియాపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆమె నటించిన 'సడక్ 2'కి విపరీతంగా డిస్ లైకులు కొట్టారు. ఆలీయాను ట్రోల్ చేశారు. ఇవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. 50 మిలియన్ ఫాలోయర్లు వచ్చిన సందర్భంగా పెట్టిన పోస్టులోనూ లైకులు లేదా డిస్ లైకులు, ఫాలో లేదా అన్ ఫాలో, ట్రోల్ లేదా పోల్ మన నుండి మనల్ని వేరు చేయలేవని అలియా పేర్కొన్నారు.
Also Read