నాగ్ మాట వినని జీవీకే చిరు మాట వింటాడా..?
on Feb 27, 2017
ప్రస్తుతం టాలీవుడ్తో పాటు నార్త్, సౌత్ ఫిలింవర్గాల్లో హాట్ టాపిక్ ఏంటంటే అఖిల్-శ్రేయా భూపాల్ పెళ్లి ఆగిపోవడమే. ఎందుకంటే రెండు పెద్ద కుటుంబాలు కావడం..నేషనల్ వైడ్ పాపులారిటీ వుండటంతో ఈ న్యూస్ వైరల్ అవుతోంది. అక్కినేని ఫ్యామిలీ ఎన్ని రాజీ ప్రయత్నాలు చేసినా శ్రేయా కుటుంబం కరగడం లేదు..వారు తెగదెంపులు చేసుకోవడానికే సిద్దపడుతున్నారు తప్ప పొరపాటును సరిదిద్దుకోవాలని చూడటం లేదు..ఏకంగా పెళ్లి కొడుకు తండ్రి నాగార్జున మాటనే వారు తీసి పక్కన పెట్టారంటే ఈ పెళ్లిపై జీవీకే కుటుంబం ఎంత పట్టుదలగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అఖిల్ కోసం మెగాస్టార్ రంగంలోకి దిగారు.
టాలీవుడ్లో నాగ్-చిరు మంచి ఫ్రెండ్స్, అంతేకాదు బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఆ రిలేషన్తోనే ఈ పెళ్లిని పట్టాలెక్కించే బాధ్యతను భుజానికెత్తుకున్నారట చిరు.. చిరు కోడలు ఉపాసన తాతయ్య అపోలో ప్రతాప్ రెడ్డి కుటుంబానికి, జీవీకే కుటుంబానికి మంచి అనుబంధం ఉంది..ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారి చేత జీవీకే కుటుంబానికి నచ్చజెప్పించి పెళ్లిని గాడిలో పెట్టేందుకు చిరంజీవి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఫిలింనగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read