`ఆర్ ఎక్స్ 100` డైరెక్టర్ తో అఖిల్
on Apr 19, 2021
`ఆర్ ఎక్స్ 100`తో దర్శకుడిగా తొలి అడుగేశాడు అజయ్ భూపతి. ఫస్ట్ ఎటెంప్ట్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రస్తుతం ఈ ఈ టాలెంటెడ్ డైరెక్టర్ శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో `మహాసముద్రం` అనే మల్టిస్టారర్ చేస్తున్నాడు. అదితి రావ్ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఆగస్టు 19న రిలీజ్ కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నిర్మాణదశలో ఉండగనే మరో ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నాడట అజయ్. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. అక్కినేని బుల్లోడు అఖిల్ తో అజయ్ భూపతి తదుపరి చిత్రం ఉండబోతోందని సమాచారం. అంతేకాదు.. బ్లాక్ బస్టర్స్ హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుందని టాక్. త్వరలోనే అఖిల్ - అజయ్ భూపతి కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
కాగా, అఖిల్ తాజా చిత్రం `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్` జూన్ 19న విడుదలకు సిద్ధమైంది. ఆ తరువాత స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో `ఏజెంట్` చేయబోతున్నాడు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న `ఏజెంట్` థియేటర్స్ లో సందడి చేయనుంది.
Also Read