సీబీసీఐడీ ఆఫీసర్గా అజిత్
on Jun 13, 2021
గత చిత్రం 'నేర్కొండ పార్వై' ('పింక్' రీమేక్)లో లాయర్ గా ఆకట్టుకున్నాడు 'తల' అజిత్. ప్రస్తుతం ఆయన 'వాలిమై' చిత్రంలో నటిస్తున్నాడు. 'నేర్కొండ పార్వై'ని డైరెక్ట్ చేసిన హెచ్. వినోద్ దర్శకత్వంలోనే ఈ సినిమా రూపొందుతుండగా.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒకే ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించిన చిత్రీకరణ మొత్తం పూర్తయింది. విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు తొలిగించాక.. ఈ పోరాట ఘట్టాన్ని చిత్రీకరించేందుకు యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో అజిత్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడనే విషయంపై ఇంతవరకు క్లారిటీ లేదు. తాజాగా దీనిపై స్పందించాడు దర్శకుడు వినోద్. సీబీసీఐడీ (క్రైమ్ బ్రాంచ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) అధికారి పాత్రలో అజిత్ దర్శనమివ్వనున్నాడట. ఈ పాత్రని చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశామని.. అజిత్ కెరీర్ లో మెమరబుల్ రోల్ గా ఈ క్యారెక్టర్ ఉంటుందని వినోద్ చెప్పుకొచ్చాడు.
కాగా, 'ఆర్ ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషి నాయికగా నటిస్తోంది. దీపావళి కానుకగా 'వాలిమై'ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read