ఆ బ్లాక్బస్టర్ రీమేక్లో ఐశ్వర్యా రాజేశ్!
on Sep 19, 2020
భాగ్యరాజ్ ఆల్ టైమ్ బ్లాక్బస్టర్ మూవీ 'ముందానై ముడిచ్చు' (1983) రీమేక్లో హీరోగా శశికుమార్ నటించనున్న విషయాన్ని ఇదివరకే ప్రస్తావించుకున్నాం. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం హీరోయిన్గా ఐశ్వర్యా రాజేశ్ ఎంపికైంది. ఇప్పటికే పలు తమిళ చిత్రాలలో అద్భుత పర్ఫార్మెన్స్లతో ఆకట్టుకున్న ఆమె తెలుగులోనూ ఇప్పుడు మంచి మంచి అవకాశాలను పొందుతూ వస్తోంది. ఒరిజినల్లో ఊర్వశి చేసిన పాత్రను ఐశ్వర్య పోషించనుంది.
'ముందానై ముడిచ్చు' గతంలో తెలుగులో 'ముడు ముళ్లు' (1983) పేరుతో రీమేక్ అయ్యి ఇక్కడా ఘన విజయం సాధించింది. జంధ్యాల డైరెక్ట్ చేసిన ఆ మూవీలో చంద్రమోహన్, రాధిక, గీత నటించారు. ఒరిజినల్లో ఆ పాత్రలను భాగ్యరాజ్, ఊర్వశి, పూర్ణిమా భాగ్యరాజ్ చేశారు.
కాగా 'ముందానై ముడిచ్చు' రీమేక్లో హీరోయిన్గా ఎంపికైన ఆనందాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది ఐశ్వర్య. "తమిళ సినిమా మైలురాళ్లలో ఒకటిగా నిలిచిన 'ముందానై ముడిచ్చు' రీమేక్లో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నా. ఎంతో ఉద్వేగంగా ఉంది. 2021లో దీన్ని చూడండి" అని ఆమె ట్వీట్ చేసింది.
ఒరిజినల్ మూవీకి కథ, సంభాషణలు, స్క్రీన్ప్లే అందించిన భాగ్యరాజ్ ఈ సినిమాకూ నేటి కాలానికి అనుగుణంగా వాటిని సమకూరుస్తున్నారు. బాలాజీ డైరెక్ట్ చేయనున్నాడు.
Also Read