ఐశ్వర్యారాయ్, ఆరాధ్య సైతం కరోనా పాజిటివ్!
on Jul 12, 2020
అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ శనివారం కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ కాగా, ఆదివారం ఆయన కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్యకు కూడా కరోనా వైరస్ సోకినట్లు టెస్టుల్లో వెల్లడైంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. అయితే అమితాబ్ భార్య జయా బచ్చన్ మాత్రం టెస్ట్లో నెగటివ్గా వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆయన తెలిపారు. బచ్చన్ కుటుంబం వీలైనంత వేగంగా కోలుకోవాలనే ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.
మొత్తానికి అమితాబ్ కుటుంబంలోని ఐదుగురు సభ్యుల్లో నలుగురికి కొవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ కావడం సినీ వర్గాల్లో తీవ్రమైక కలకలాన్నీ, సంచలనాన్నీ సృష్టిస్తోంది. ఎవరి ద్వారా ఆ కుటుంబానికి కరోనావైరస్ సోకిందనేది ప్రశ్నార్ధకంగా మారింది. వారికి కరోనా లక్షణాలు కనిపించే సమయానికి అమితాబ్ తన ఇంట్లోనే రెండు వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన షూటింగ్లలో పాల్గొన్నారు. అలాగే టీవీ గేమ్ షో 'కౌన్ బనేగా క్రోర్పతి' ప్రోమోలోనూ ఆయన నటిస్తున్నారు. ఆ షూటింగ్లకు సంబంధించిన సిబ్బంది ద్వారా ఆయన కొవిడ్ బారిన పడ్డారా లేక ఇంకెవరి ద్వారానైనా ఆయనకు ఆ వైరస్ సోకిందా.. అంటూ బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.
Also Read