అజ్ఞాతవాసి రికార్డుల మోత
on Dec 17, 2017
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం అజ్ఞాతవాసి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ఈ మూవీ టీజర్ శుక్రవారం రిలీజైంది. విడుదలైన నెక్ట్స్ మినిట్ నుంచి అజ్ఞాతవాసి యూట్యూబ్లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. విడుదలకు ముందు రోజే అజ్ఞాతవాసి హ్యాష్ ట్యాగ్తో ఇండియా ట్రెండ్స్లో నాలుగో స్థానంలో నిలిచి.. ఇప్పుడు తాజాగా మరో ఘనత సాధించింది. టాలీవుడ్లోనే అత్యధిక మంది లైక్ చేసిన టీజర్గా అజ్ఞాతవాసి అవతరించింది. ఇప్పటి వరకు ఈ టీజర్ను 3,65,000 మంది లైక్ చేసి రికార్డుల్లోకి ఎక్కింది. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కిర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చిన అజ్ఞాతవాసి ఆడియోను డిసెంబర్ 19న విడుదల చేయనున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.