‘అజ్ఙాతవాసి’కి అవమానం!
on Jan 9, 2018
ప్రపంచవ్యాప్తంగా తెలుగువారందరూ ‘అజ్ఙాతవాసి’ సినిమా గురించి ఎదురుచూస్తోంది. అందుకు తగ్గట్టే.. అత్యధిక ధియేటర్లలో దాదాపు రెండు వేలకు పై చిలుకు థియేటర్లలో పవర్ స్టార్ కనిపించనున్నాడు. అయితే... ఒక్క తమిళనాడులో మాత్రం ‘అజ్ఙాతవాసి’కి అన్యాయం జరుగుతోంది.
తమిళ హీరోల డబ్బింగ్ సినిమాలు ఇక్కడ తెలుగు సినిమాలకు పోటీగా విడుడల అవుతున్నాయ్. వందల కొద్దీ స్క్రీన్స్ లో డబ్బింగ్ సినిమాలు ఆడుతున్నాయ్. అంతెందుకు.... రేపు 12 తేదీన బాలయ్య ‘జై సింహ’కు పోటీగా వందల కొద్దీ థియేటర్లలో సూర్య ‘గ్యాంగ్’ సినిమా విడుదల అవుతోంది. టాలీవుడ్ తమిళ సినిమాను కూడా ఆ స్థాయిలో గౌరవిస్తుంటే...
తమిళ పరిశ్రమ మాత్రం తెలుగు సినిమాను ఎప్పటిలాగే చిన్న చూపు చూస్తోంది. పవన్ కి తమిళనాట అభిమాన గణం భారీగానే ఉంది. ఎందుకంటే... తెలుగువారికి అక్కడ కొదవ లేదు కాబట్టి. అంతేకాదు... అజిత్, విజయ్ అభిమానులు పవన్ ని బాగా అభిమానిస్తారు.
కారణం... అజిత్, విజయ్ సినిమాలను పవన్.. వపన్ సినిమాలను అజిత్, విజయ్ లు రీమేక్ చేసి విజయాలను అందుకున్నారు. ఇన్ని కారణాల వల్ల తమిళనాట కూడా పవన్ అభిమానులు భారీ స్థాయిలోనే ఉన్నారు. కానీ... రేపు ‘అజ్ఙాతవాసి’ చిత్రం తమిళ నాట చాలా తక్కువ థియేటర్లలోనే విడుదల అవుతోంది. చెన్నయ్ మొత్తం మీద ఓ వంద స్క్రీన్స్ కూడా ఆ సినిమాకు ఇవ్వలేదు. మల్టీప్లెక్సలయితే... ఒక్కటి కూడా లేదు. ఇది నిజంగా తెలుగు సినిమాకు అవమానమే.
మరి ఈ పరిణామం తెలుగు చిత్ర పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.