మేజర్... ప్రతిరోజూ కరోనా టెస్టులే!
on Sep 16, 2020
ముంబయ్ 26/11 ఉగ్ర దాడుల్లో ప్రజలను కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఎన్ఎస్జి కమాండో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితంగా ఆధారంగా తెరకెక్కుతోన్న తెలుగు సినిమా 'మేజర్'. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేష్ నటిస్తున్నాడు. లాక్డౌన్ తరవాత ఇటీవల ఈ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ చేశారు. కరోనా నేపథ్యంలో షూటింగులో ప్రతి ఒక్కరికీ రోజూ టెస్టులు చేస్తున్నామని అడివి శేష్ తెలిపాడు. యూనిట్ అందరికీ ఎక్కడికీ బయటకు వెళ్లవద్దనీ, ఇంటి నుండి నేరుగా షూటింగుకు రమ్మని చెబుతున్నామని అన్నాడు.
ప్రతిరోజూ ర్యాపిడ్ టెస్టులు చేయడంతో పాటు వారానికి ఒకసారి శ్వాబ్ టెస్ట్ చేస్తున్నారట. నెక్స్ట్ వీక్ 'మేజర్' టీమ్ మరో భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తోందట. సెట్ లో సేఫ్టీ మెజర్స్ తీసుకోవడానికి ప్రత్యేకంగా నియమించామని, యూనిట్ హెల్త్ విషయంలో రిస్క్ తీసుకోదలుచుకోలేదని అడివి శేష్ అన్నాడు. కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం కేవలం నటన మీద దృష్టి పెడుతున్నానని అన్నాడు.
Also Read