అడివి శేష్ 'ఎవరు'కి డెడికేట్ చేస్తున్నాడో తెలుసా?
on Aug 14, 2019
`క్షణం` , `గూఢచారి` చిత్రాలతో అడివి శేషు హీరోగా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక `ఎవరు`సినిమాతో మరో సక్సెస్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు . ఈ సినిమా ఈ నెల 15న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భం గా మంగళవారామ్ ప్రీ రిలీజ్ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమం లో అడివిశేషు మాట్లాడుతూ...`` ఈ సినిమాను ఇండస్ట్రీకి సంబంధం లేని ఓ 1000 మందికి చూపించాం. మాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ నుండి సినిమాను బెటర్ చేస్తూ వచ్చాం. ఓ సందర్భంలో ఇక మేం మాట్లాడటానికి ఏమీ లేకుండా.. వాళ్లే వచ్చి పలానా అంశం బావుందని, నచ్చిందని చెప్పుకుంటూ వచ్చారు. క్షణం సినిమా చేస్తున్నప్పుడు మా ఆఫీస్ బాయ్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. `ఆ ఏముందిలే ఏదో చిన్న సినిమా` అని అంటున్నాడు. ఇప్పుడు మా `ఎవరు` సినిమాను ఆ ఆఫీస్ బాయ్కి డేడికేట్ చేస్తున్నాను. ఆ అబ్బాయిని తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను ప్రతిసారి నేను కష్టపడుతూనే ఉన్నాను. నేను 2.0 అప్గ్రేడ్ వెర్షన్ అనుకుని క్షణం, అమీతుమీ, గూఢచారి సినిమాలు చేశాను. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది అంటూ సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ని వ్యక్తపరిచాడు.