కరోనాపై యుద్ధానికి ఆదిత్య మ్యూజిక్ విరాళం రూ. 31 లక్షలు
on Apr 6, 2020
తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా నెలకొంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలకు మద్ధత్తుగా పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు భారీ ఎత్తున ఆర్ధిక సహకారం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ కరోనా నివారణకు తమ వంతుగా ఆర్ధిక సహకారం అందించడానికి ముందుకొచ్చింది. ఆదిత్య మ్యూజిక్ అధినేతలు ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా, దినేశ్ గుప్తా, ఆదిత్య గుప్తా తాజాగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుని కలిసి కరోనా నివారణ చర్యలకు గాను సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. 31 లక్షలు విరాళం అందించారు.
ఈ సందర్భంగా ఆదిత్య మ్యూజిక్ మేనెజింగ్ డైరెక్టర్ ఉమేశ్ గుప్తా మాట్లాడుతూ, "కరోనా కారణంగా యావత్ మానవాళి ఇబ్బందుల్లో పడింది. ఈ మహమ్మారి నివారణకు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నివారణ చర్యలు చాలా అభినందనీయం. ఇలాంటి కఠినమైన సమయంలో సైతం ఎలాంటి ప్రమాదాల్ని లెక్క చేయకుండా ఎంతో మంది పోలీసులు, వైద్య, శానిటరీ సిబ్బంది మనందరి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. వారిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వం వారు చేస్తున్న సూచనలు తప్పక పాటిస్తూ ఇలానే సెల్ఫ్ ఐసోలేషన్ లో ప్రజలంతా ఉంటే తొందర్లోనే సంపూర్ణంగా కరోనా నివారణ జరిగే అవకాశం ఉంది" అని చెప్పారు.
Also Read