నటనలోనే కాకుండా చదువులోనూ రాణిస్తున్న ఈ తరం హీరోయిన్స్...
on Oct 7, 2019
ఈ తరం హీరోయిన్స్ అందం, నటనలోనే కాకుండా చదువులోనూ రాణిస్తున్నారు. మహానటిలో మరో సావిత్రమ్మలా ట్రెడిషనల్ గా మెప్పించిన కీర్తి సురేష్ నిజ జీవితంలో మాత్రం ఫ్యాషన్ స్టూడెంట్. ఫ్యాషన్ డిజైనింగ్ లో ఈ మల్లూ బ్యూటీ డిగ్రీ చేసింది. హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందింది, జస్కీ బ్యూటీ రెజీనా అయితే సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంజలి గణితంలో, అనుష్క శెట్టి కంప్యూటర్ అప్లికేషన్స్ లో బ్యాచిలర్ డిగ్రీలు పూర్తి చేశారు. అలాగే మాస్ జనానికి ఎంతో ప్రియమైన పక్కా లోకల్ బ్యూటీ కాజల్ అయితే మాస్ మీడియాలో డిగ్రీ సర్ట్ఫికెట్ పొందింది. రెగ్యులర్ డిగ్రీలు కానిచ్చేసి, ఓ సర్టిఫికెట్ సంపాదించాం అన్నట్టు కాకుండా కొందరు హీరోయిన్స్ కాస్త భిన్నమైన చదువుల కూడా చదివారు. శ్రద్ధా దాస్ జర్నలిజంపై శ్రద్ధతో అందులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిందట. ఇక కలర్స్ గర్ల్ స్వాతిరెడ్డి బయోటెక్నాలజీ లాంటి విభిన్నమైన అంశల్లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది.
మంచు వారి అమ్మాయి లక్ష్మీ కూడా అమెరికా వెళ్లి తన అభిరుచికి తగ్గట్టుగా ఓక్లహామా విశ్వ విద్యాలయం నుంచి థియేటర్ ఆర్ట్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ సంపాదించింది. శృతిహసన్ అయితే హీరోయిన్ అవ్వక ముందు సైకాలజీ డిగ్రీకి సై అనేసింది. ఆర్టిస్టులుగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హీరోయిన్స్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ డిగ్రీలు కూడా చాలానే పూర్తి చేశారు. తమన్నా, ఇలియానా, శ్రియా, రాశీఖన్నా వీరంతా వివిధ రకాల బీఏలు చేసిన ఆర్టిస్టులే. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్సే కాకుండా కామర్స్ లోనూ మన కాంతామణులు తమ సత్తా చాటారు. త్రిష బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేయగా, సమంత కూడా కామర్స్ స్టూడెంటే. మరోవైపు పూజా హెగ్డే అయితే డిగ్రీ తర్వాత పోస్టు గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసి ఎంకాం సర్టిఫికెట్ పొందిందట. కన్నడ బ్యూటీ రష్మిక అయితే సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్ లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. అన్ని విద్యలూ నేర్చి ప్రస్తుతం గ్లామర్ కోర్సులో పీ.హెచ్.డీ చేసే పనిలో ఉంది.
Also Read