ENGLISH | TELUGU  

నువ్వు సిగ్గుపడకమ్మా..చచ్చిపోవాలనిపిస్తుంది..!

on Sep 25, 2017

‘పోకిరి’ సినిమాలో ఇలియానా నడుచుకుంటూ వస్తుంటుంది. చెడ్డ పోలీసైన అశిష్ విద్యార్థి... ఆ అమ్మాయిని చూసీ... ‘కోహినూర్ వజ్రాన్ని బ్రిటీషోల్లో ఎత్తికెళ్లిపోయారని ఎవర్రా చెప్పింది?. అదిగో... రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది చూడు కోహినూర్ వజ్రం’ అంటాడు. నిజానిక్కూడా ఆ అమ్మాయ్ అలాగే ఉంటుంది లేండి. నిండా 20 ఏళ్లు కూడా ఉండవ్. ఆ డైలాగ్ కే ఓ సార్థకతనిచ్చింది ఆ అమ్మాయ్.

ఇప్పుడు అదే డైలాగ్ ని... ఓ వ్యక్తి... మరోకర్ని ఉద్దేశించి వాడాడు. దాంతో అందరూ అవాక్కయ్యారు.. అవుతున్నారు కూడా. కలవరానికి లోనై... ఆ డైమండేదో కానీ...  దాన్ని ఎత్తుకుపోవడమే మంచిదైందనుకుంటున్నారట అంతా. 
ఇంతకీ అనిన ఆ వ్యక్తి ఎవరూ...? ఎవర్ని ఉద్దేశించి అన్నాడు? జనాలు అంతటి కలవరానికి లోనవ్వడానికి కారణం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలా. సరే... అసలేం జరిగిందంటే...

ఓ ప్రముఖ ఛానల్ లో... సూపర్ హిట్ అయిన... ఓ ప్రోగ్రామ్ కి దసరా సందర్భంగా కొత్త హంగులద్దారు. దానికి ‘దసరా మహోత్సవం’ అని నామకరణం చేశారు. కొసరుగా ముందు ప్రోమోని జనాల మీదకు సంధించారు. ఇంకేముంది.. ఆ ప్రోమో... రెండు తెలుగు రాష్ట్రాల్లో అరాచకం సృష్టించడం మొదలుపెట్టింది. చూసిన వారు చిత్రంగా ప్రవర్తిస్తున్నారని టాక్. 

ప్రోమో మొదలవ్వగానే... మెగా బ్రదర్ నాగబాబు... ‘కోహినూర్ డైమండ్’ డైలాగ్ వాడతారు. ఎవరిమీద అనుకుంటున్నారూ... మన నగిరి ఎమ్మెల్యే రోజా మీద. ఆవిడగారేమో... సిగ్గు పడిపతూ... నాగబాబు వంక కొంటెగా చూస్తారు. నాగబాబు ఏదో పొరపాటున అంటే... ఈవిడ ఎక్స్ ప్రెషన్ ఏంట్రా భగవంతుడా? అంటూ ఇంటితెర ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. 
కోహినూరు డైమండ్... అచ్చంగా ఎమ్మెల్యే రోజాలా ఉంటుందన్న మాట ఎప్పుడైతే జనాలు విన్నారో... ‘బ్రిటీషు వారికి మా కృతజ్ఙతలు’ అంటూ సోషల్ మీడియాల తెగ సెటైర్లేస్తున్నారు. 

లొకేషన్లో ఏదో గొడవలు జరుగుతున్నట్లు చూపించడం ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. కొట్టుకోడాలు చూడ్డం జనాలకి సరదా కదా.  కచ్చితంగా చూస్తారని వీరి ప్లాన్. దాని కోసం సినిమాకో, సీరియల్ కో రాసుకున్నట్లు స్క్రిప్ట్ కూడా రెడీ చేస్తున్నారు. 

నిజంగా లొకేషన్లో గొడవ జరిగినట్లే కలరింగ్ ఇచ్చేస్తారు. మధ్య మధ్య కలర్ మారుతుంటుంది. ఉన్నట్టుండి స్లో మోషన్, మధ్య మధ్యలో డైలాగులు మ్యూట్ అవుతుంటాయ్.. ఈ పిచ్చి జనాలేమో... అక్కడ ఏదో జరగిందని టైమ్ కి టీవీ ముందు వాలిపోతారు. ‘వినేవాడు విప్ప వూవు అయితే... చెప్పేవాడు చామంతి పూవు’ అని ఊరకనే ఉన్నారా? 

ఈ ప్రోమో నిండా ఓవరేక్షనే. ప్రోమోలో ఉన్నట్టుండి నగిరి ఎమ్మెల్యే రోజా కంటతడి పెట్టుకుంటుంది. ‘నేను ఈ రోజున ఎమ్మెల్యే అయ్యానంటే.... దానికి కారణం ఈ కామెడీ షో నే’ అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె కన్నీరు మున్నీరవుతుంటే... పక్కనున్న రేష్మీ ఆమెను బుజ్జగిస్తుంటుంది. 
పాపం... వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చివరకు కామెడీ షోకి  ఇచ్చిన విలువ కూడా జగన్ కి ఇవ్వలేదు రోజా అని సోషల్ మీడియాలో కామెంట్లపై కామెంట్లు. ‘కామెడీ షోలు చూసి ఓట్లేసే కామెడీ గాళ్లా.. జనాలు?’ అంటూ ప్రశ్నల్ని కూడా సంధిస్తున్నారు. 

అమ్మా... రోజమ్మా... నువ్వు సిగ్గుపడకమ్మా... ప్లీజ్.. గుండెని ఎవరో పిండేసినట్లు అనిపిస్తోంది... అని నెటిజన్లు ప్రాధేయపడుతున్నారు. రోజా.. ఎంత పని చేశావమ్మా... ఎంతపని చేశావ్. 


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.