బిగ్ బాస్ 4 హౌస్లో పూనమ్?
on Jul 2, 2020
నటి పూనమ్ బజ్వా గుర్తుందిగా!.. 'మొదటి సినిమా', 'బాస్', 'పరుగు' వంటి సినిమాల్లో మెరిసిన ఆమె ఈ మధ్య 'యన్.టి.ఆర్: కథానాయకుడు' చిత్రంలో ఎన్టీఆర్ కుమార్తె లోకేశ్వరి పాత్రలో కనిపించింది. పాపులర్ అండ్ కాంట్రావర్షియల్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు నాలుగో సీజన్లో పూనమ్ కంటెస్టెంట్గా కనిపించనున్నదంటూ ఆన్లైన్లో జోరుగా ప్రచారం నడుస్తోంది. బిగ్ బాస్ 3కి హోస్ట్గా వ్యవహరించిన అక్కినేని నాగార్జున ఈ నాలుగో సీజన్కూ హోస్ట్గా వ్యవహరించడం ఖాయమైన విషయం తెలిసిందే. కొద్ది రోజుల క్రితం సమంత హోస్ట్గా ఎంపికైందంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలిపోయింది.
కరోనా మహమ్మారి కారణంగా, ఈ షో ప్రిపరేషన్ పనులు బాగా ఆలస్యమయ్యాయి. ఆగస్ట్లో స్టార్ మా చానల్లో బిగ్ బాస్ 4 షో మొదలవుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే మునుపటి సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తోంది. థర్డ్ సీజన్ 100 రోజుల పాటు నడిచి బ్లాక్బస్టర్ కాగా, ఫోర్త్ సీజన్లో ఈ షోను 50 రోజులకు కుదించారని వినిపిస్తోంది. కంటెస్టెంట్లు కూడా 12 మందే ఉంటారంట. అందుకని నిర్వాహకులు సాధ్యమైనంత ఎక్కువగా షోకు గ్లామర్ను అద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో హంసానందిని, శ్రద్ధా దాస్ వంటి తారల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా పూనమ్ బజ్వా పేరు ఖాయమైందనీ, ఆమె కూడా కాంట్రాక్ట్పై సంతకం చేసిందనీ సమాచారం. త్వరలోనే ఈ షోకు సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడవనున్నది.