నగ్మాకు కంగన కౌంటర్ ఇవ్వలేదేంటి?
on Sep 24, 2020
బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు చెబితే చాలు... కంగనా రనౌత్ బుసలు కొడుతున్నారు. సుశాంత్ మరణం మొదలుకొని ఇప్పటివరకు చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు టార్గెట్ చేస్తూ... మహారాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచారు. అటువంటి కంగనా రనౌత్ ను ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు నగ్మా టార్గెట్ చేశారు.
డ్రగ్స్ కేసులో స్టార్ హీరోయిన్లు దీపిక పదుకొనే, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్ తదితరులకు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరి కంగనా రనౌత్ కు ఎందుకు సమన్లు జారీ చేయలేదని నార్కోటిక్స్ బ్యూరోను నగ్మా ప్రశ్నించారు. వాట్సాప్ మెసేజ్ లను ఆధారంగా చేసుకుని కొంత మంది హీరోయిన్లకు సమన్లు జారీ చేసినప్పుడు... ఒక వీడియోలో బ్రేక్ తీసుకుందాం అని చెప్పిన ఎందుకు వదిలేశారని ఆమె పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తున్నారని నగ్మా అన్నారు.
తనపై ఎవరు ఏం మాట్లాడినా కౌంటర్లు ఇవ్వడం కంగనా రనౌత్ స్టైల్. తానెప్పుడూ గొడవ స్టార్ట్ చేయలేదని ఫినిష్ చేశానని ఇటీవల ట్వీట్ చేశారు కూడా. అటువంటి కంగనారనౌత్... ఇప్పుడు నగ్మా కు కౌంటర్ ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని నెటిజన్లు అంటున్నారు. ఆల్రెడీ డ్రగ్స్ తీసుకున్నానని ఆయన స్వయంగా చెప్పిన వీడియో ఉండడంతో... ఏం మాట్లాడినా ఆమె మెడకు చుట్టుకుంటోంది ఏమోనని మౌనంగా ఉందేమోనని మాట్లాడుకుంటున్నారు.