మోసం చేశాడంటూ 'పోకిరి' సినిమాటోగ్రాఫర్పై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి
on May 27, 2020
సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ నటి సాయిసుధ ఆరోపించారు. ఈ మేరకు ఆమె సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనతో సహజీవనం చేసేలా ఒత్తిడి చేసిన అతను తర్వాత మోసం చేశాడని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.
శ్యామ్ కె. నాయుడు ఎవరో కాదు, స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె. నాయుడుకు స్వయానా తమ్ముడు. చాలా కాలం డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆస్థాన సినిమాటోగ్రాఫర్గా ఉన్నాడు. పోకిరి, బిజినెస్మ్యాన్, జులాయి, కెమెరామన్ గంగతో రాంబాబు, టెంపర్ వంటి సినిమాలకు పనిచేశాడు.
మరోవైపు సాయిసుధ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటిస్తున్నారు. దమ్ము, బాడీగార్డ్, అవును, అర్జున్రెడ్డి, ఎవరు తదితర సినిమాల్లో నటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్యామ్ కె. నాయుడును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.