జూన్ 15 నుంచి 'ఆచార్య' షూటింగ్?
on May 26, 2020
టాలీవుడ్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్లో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో తయారవుతున్న 'ఆచార్య' ఒకటి. ఫిల్మ్నగర్లో చక్కర్లు కొడుతున్న సమాచారం నిజమే అయితే ఈ సినిమా 2020లో వచ్చే అవకాశాలు లేవు. 2021 సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. దీనికి కారణం ఊహించగలిగేదే.. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ కారణంగా సుమారు రెండున్నర నెలలుగా షూటింగ్ నిలిచిపోవడం.
తెలంగాణ ప్రభుత్వం సినిమా షూటింగ్లకు నిబంధనలతో కూడిన అనుమతులు జారీ చేశాక, జూన్ 15 నుంచి 'ఆచార్య' మూవీ షూటింగ్ కొనసాగనున్నదని అంతర్గత వర్గాలు తెలిపాయి. రానున్న షెడ్యూల్లో రెండు పాటలు, ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించనున్నారు. ఇప్పటివరకూ ఈ చిత్రానికి సంబంధించి 40 శాతం సన్నివేశాలను చిత్రీకరించారు. చిరంజీవి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తోన్న ఈ మూవీలో ఓ ప్రత్యేక పాత్రను రామ్చరణ్ చేస్తున్నాడా, లేదా.. అనే విషయమై ఇప్పటికీ క్లారిటీ లేదు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాటినీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.